![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -792 లో...కావ్యకి రాజ్ ప్రపోజ్ చేస్తాడు. కావ్య నాకు ఇష్టం లేదని చెప్తుంది. ఏదో క్లోజ్ గా మాట్లాడినంత మాత్రాన అలా మీరు ఉహించుకొని ఇలా చెయ్యడం కరెక్ట్ కాదని కావ్య అంటుంటే.. ఇంట్లో అందరు షాక్ అవుతారు. అలా రాజ్ ని దూరం పెట్టేలా కావ్య మాట్లాడుతుంటే అపర్ణకి కోపం వచ్చి తనపైకి చెయ్ ఎత్తుతుంది. దాంతో రాజ్ ఆపుతాడు. మీరు తననే నెత్తిన పెట్టుకొని ఊరేగండి అని కావ్య అక్కడ నుండి వెళ్లిపోతుంది.
కాసేపటికి రాజ్ బాధగా వెళ్ళిపోతాడు. మరొకవైపు రుద్రాణి యామినికి రుద్రాణి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉందని యామిని అంటుంది. తన పేరెంట్స్ తో కూడా రాకుండా ప్రపోజ్ చేస్తే కావ్య వద్దని చెప్పిందట అని యామిని చెప్తుంది. ఆ తర్వాత రాహుల్ ఇంటికి వచ్చి ఆ అప్పు మిస్ అయిందని రుద్రాణికి చెప్తాడు. అది నిన్ను చూసిందేమో.. అందుకే కానిస్టేబుల్స్ నిన్ను అలా డైవర్ట్ చేశారని రుద్రాణి అంటుంది. కానీ ఇంట్లో ఇదంతా జరిగిందని మొత్తం చెప్పగానే రాహుల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు.
మరొకవైపు బాబుని తీసుకొని రేవతి ఇంటికి వెళ్తుంది అప్పు. వాళ్లకు బాబూ అప్పగించి అప్పు వెళ్ళిపోతుంది. నేను తప్పిపోవడం బాగుంది అమ్మ.. తప్పిపోతేనే కదా మా ఫ్రెండ్ వాళ్ళింటికి తీసుకొని వెళ్ళింది.. నన్ను బాగా చూసుకుందని బాబూ చెప్తుంటే రేవతి మురిసిపోతుంది. ఆ తర్వాత రాజ్ డల్ గా వెళ్ళిపోతుంటే అపర్ణ, ఇందిరాదేవి వచ్చి మాట్లాడుతారు. అది అలా మాట్లాడింది కానీ నువ్వు అంటే ఇష్టమని రాజ్ తో ఇందిరాదేవి అంటుంది. తను వద్దంటే నాకు లైఫ్ లేదనిపిస్తుందని రాజ్ బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |